News July 27, 2024
బ్రిక్స్లో భారత్ ప్రతినిధిగా విశాఖ అమ్మాయి
రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పెందుర్తిలోని నీలకంఠపురానికి చెందిన షేక్ ఆయేషా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PHD చేస్తున్నారు. దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయి కావడం విశేషం.
Similar News
News October 1, 2024
టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: విశాఖ కలెక్టర్
ఉమ్మడి విశాఖ జిల్లాలో 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ (కంప్యూటర్ బేస్డ్ – టెస్ట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 60,574 మంది హాజరుకానున్నారు. అభ్యర్థులకు జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News October 1, 2024
అండర్-17 రాష్ట్రస్థాయి పోటీలు: ఖోఖోలో విజేతగా విశాఖ జట్టు
వినుకొండ లయోలా హైస్కూల్లో జరుగుతున్న అండర్-17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఖోఖోలో విశాఖ జట్టు విజేతగా నిలవగా, రన్నరప్ స్థానాన్ని అనంతపురం దక్కించుకుంది. ఫుట్బాల్లో వైఎస్ఆర్ కడప విజయం సాధించగా.. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాల్బ్యాడ్మింటన్లో గుంటూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేతలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బహుమతులను ప్రదానం చేశారు.
News October 1, 2024
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ
అంతర్జాతీయ కాఫీ డే సంధర్బంగా.. కాఫీ అంటే గుర్తొచ్చే మన బ్రాండ్ అరకు కాఫీ. దీనికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీని మెచ్చుకున్నారు. ఏజెన్సీలో అటవీశాఖ, కాఫీ బోర్డు కలిసి 1970లో సాగును ప్రారంభించింది. 1974 నుంచి ITDA రైతులతో కాఫీ పంట సాగును ప్రారంభించింది. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్లో 1.40 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు.