News February 1, 2025
బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయండి: కలెక్టర్

ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారుల మీద బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తరచు వాహనాలు తనిఖీలు చేపట్టి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
Similar News
News December 6, 2025
జగన్ క్షమాపణ చెప్పాలి: నాగరాజు

బలహీన వర్గాలకు చెందిన ఐపీఎస్ అధికారి గోపినాథ్ జెట్టిని, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కిష్ణయ్యను అగౌరవపరుస్తూ మాట్లాడిన వైఎస్ జగన్మెహన్ రెడ్డి వారిరువురికీ వెంటనే క్షమాపణ చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మీలా తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని వారు ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు సంపాదించలేదన్నారు.
News December 6, 2025
బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 5, 2025
స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఎం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో స్క్రాబ్ టైపస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవి శుక్రవారం తెలిపారు. తలనొప్పి, జ్వరం, శరీరం మీద దద్దర్లు, కళ్లకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని తెలిపారు.


