News December 4, 2024
బ్లేడ్తో భర్త గొంతు కోసి చంపిన భార్య.. అనుమానాలే కారణం

భర్త గొంతు కోసం భార్య <<14781158>>హతమార్చిన<<>> ఘటన నిన్న గుడివాడలో జరిగిన సంగతి తెలిసిందే. భార్యభర్తల మధ్య అనుమానపు విభేదాలే హత్యకు కారణంగా తెలిసింది. రైలుపేటకు చెందిన చిన్న, జ్యోతిలు ఐదు చోరీ కేసుల్లో నిందితులగా ఉన్నారు. విభేదాలు తలెత్తి ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. నిన్న జ్యోతి ఇంటికి రాగా ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బ్లేడ్తో భర్త పీక కోసి చంపింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.
Similar News
News February 17, 2026
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

* మానవత్వం చాటుకున్న మంత్రి సత్య కుమార్
* కృష్ణా : మంత్రి ఇలకాలో లిక్కర్ పంచాయతీ
* కృష్ణా : బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
* కృష్ణా : పోలీసుల వినూతన కార్యక్రమాలు
* రాజీవ్ నగర్ కాలనీలో పేకాట శిబిరంపై దాడి
* గుడివాడ: నత్త నడకన ఫ్లైఓవర్ పనులు
News February 17, 2026
కృష్ణా: ఈ దృశ్యం..ఏం చెబుతోంది?

కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం-విజయవాడ 216 జాతీయ రహదారిపై గూడూరు సెంటర్ వద్ద ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గూడూరు పోలీసులు మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా, యాక్సిడెంట్లో నుజ్జునుజ్జు అయిన వాహనాన్ని ఆ మార్గంలో ఉంచి వారికి అవగాహన కల్పిస్తున్నారు.
News February 16, 2026
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.


