News January 24, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: నిర్మల్ కలెక్టర్

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరా తీశారు. గురువారం వేడుకలు ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి వెళ్లిన ఆలయ అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
Similar News
News September 18, 2025
చేబ్రోలులో ఈనెల 19న జాబ్ మేళా: జితేంద్ర

ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత,18-35 వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 8184887146 నంబర్ను సంప్రదించాలన్నారు. 960 ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు.
News September 18, 2025
బాపట్ల: ధరల్లేక దోస రైతు దిగాలు

దోసకు సరైన ధరలు లేక జిల్లా రైతులు దిగాలు పడుతున్నారు. అద్దంకి మండలం కలవకూరుకు చెందిన ఓ రైతు 2 ఎకరాల పొలంలో దోస సాగు చేశారు. గతేది కన్నా ఈ ఏడాది తెగుళ్లు ఎక్కువడడం వల్ల దిగుబడి తగ్గిందన్నారు. ధరలు పడిపోయాయన్నారు. వినాయక చవితి వరకు 50 కిలోల బస్తా రూ.800 ఉండగా ప్రస్తుతం రూ.500లకు పడిపోయిందన్నారు. కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
News September 18, 2025
మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.