News February 6, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఈఓ మహేశ్
కాళేశ్వరం ఆలయంలో రేపటి నుంచి జరుగనున్న మహాకుంభాభిషేకానికి రానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈఓ మహేష్ అన్నారు. పీఠాధిపతులు, అర్చకులు, స్వాములు గోపురం పైకి ఎక్కేందుకు వరంజాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ లైట్లు, తాగునీటి వసతి, భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర ప్రసాదం ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కుంభాభిషేకం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు తరలిరావాలని కోరారు.
Similar News
News February 7, 2025
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?
News February 7, 2025
కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.
News February 7, 2025
మహారాష్ట్రలో 173 GBS కేసులు
మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.