News January 13, 2025
భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.
Similar News
News February 8, 2025
వరంగల్: తగ్గిన ఎంపీటీసీ, జడ్పటీసీ స్థానాలు!

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. రాబోయే ఎన్నికల కోసం ఇటీవల పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల మార్పులను ప్రభుత్వానికి పంపించారు. గత ఎన్నికల్లో 16 జడ్పీటీసీ, 178 స్థానాలు ఉండేవి. హనుమకొండ, వరంగల్ జిల్లాల పునర్విభజన, ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో 8 గ్రామాల విలీనమయ్యాయి. దీంతో వరంగల్ జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొండ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News February 8, 2025
GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నారు. జఫర్గడ్ మండలంలో వీరు “మా ఇల్లు ఆశ్రమంలో” అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అనంతరం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.