News July 8, 2024
భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు
శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
Similar News
News October 6, 2024
కర్నూలు: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం విద్యార్థి ఎంపిక
కర్నూలు ఆదర్శ విద్యా మందిరంలో ఈ నెల 2, 3వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం గురుకులం బాలిక జ్యోతి ఎంపికైంది. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు లావణ్య ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల జ్యోతిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
News October 6, 2024
నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా
బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.