News April 12, 2025

భగ్గుమంటున్న కరీంనగర్

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.

Similar News

News April 20, 2025

కరీంనగర్: 328 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 328 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో 2,66,896 ఎకరాలలో వరి సాగు అయిందని, 5,86,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయ సొమ్ము, జమ కావడం కూడా ప్రారంభమైందని తెలిపారు. జిల్లాలోని 96 మిల్లులకు 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు.

News April 20, 2025

సిరిసిల్ల: వలకు చిక్కిన భారీ చేప

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన జాలరు గోలాడ నరేశ్‌కు వలలో 32.5 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. రోజు లాగానే సిరిసిల్లలోని మిడ్ మానేరులో చేపలు పట్టడానికి వెళ్లగా వలలో భారీ చేప చిక్కిందని నరేశ్ తెలిపాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద చేప ఎప్పుడు చిక్కలేదని, మొదటిసారిగా ఇంత పెద్ద చేపను పట్టుకున్నామని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు ఆసక్తి చూపారు.

News April 19, 2025

కరీంనగర్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

image

KNR జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.7°C నమోదు కాగా, మానకొండూర్ 42.6, గన్నేరువరం 42.3, గంగాధర 42.1, రామడుగు 41.5, కరీంనగర్ 41.4, చిగురుమామిడి, చొప్పదండి 41.2, తిమ్మాపూర్ 41.1, సైదాపూర్ 40.9, శంకరపట్నం, కరీంనగర్ రూరల్ 40.7, వీణవంక 40.6, హుజూరాబాద్ 40.3, కొత్తపల్లి 39.9, ఇల్లందకుంట 39.9°C గా నమోదైంది.

error: Content is protected !!