News March 9, 2025
భగ్గుమంటున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. నేడు మ.2 గంటల సమయంలో కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కానాయిపల్లి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది.
Similar News
News November 9, 2025
గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇవే..!

పల్నాడులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ ధర రూ.200 నుంచి రూ.230, స్కిన్తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.108గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.600గా ఉంది. మటన్ కేజీ రూ.800 నుంచి 900కి విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 9, 2025
కృష్ణా: ఆ ప్రాజెక్టులు వస్తే తిరుగేలేదు.. సాధ్యమయ్యేనా.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 ప్రాజెక్టులపై సందిగ్ధత నెలకొంది. HYD-VJA, MTM-VJA 6 లైన్ల హైవేల DPRలలో మార్పులు చేయాలని నేతలు, కలెక్టర్లు NH అధికారులకు సూచించారు. మహానాడు జంక్షన్-నిడమానూరు ఫ్లైఓవర్ నిర్మాణం నిర్ణయం NH అధికారులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే VJA రూపురేఖలు మారిపోతాయని MP చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతలు ఢిల్లీలో NH అధికారులను కలుస్తామని తెలిపారు.


