News February 20, 2025
భద్రకాళి అమ్మవారి దివ్య రూప దర్శనం

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మాఘమాసం గురువారం, సప్తమి తిథి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, భక్తులకు దివ్యరూప దర్శనం కల్పించారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 9, 2025
గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా..?

హైదరాబాద్-విజయవాడ రహదారిపై చిట్యాల శివారులో గల గాంధీ గుడి కేవలం ఆలయంగానే కాక, సేవా కేంద్రంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర పలువురికి ఉపయోగకరంగా నిలుస్తోంది. ఇళ్లలో వాడుకలో లేని దుస్తులను దాతలు ఈ పాత్రలో ఉంచుతున్నారు. అన్ని వయసుల వారి దుస్తులు ఇందులో అందుబాటులో ఉండడంతో, అవసరమైన పేదలు తమకు సరిపడా దుస్తులను ఉచితంగా తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలియని వారు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
News November 9, 2025
షట్డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.
News November 9, 2025
జనసేనకు సైబర్ నేరగాళ్ల షాక్

జనసేనకు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆ పార్టీ అఫీషియల్ ఎక్స్ (ట్విటర్) అకౌంట్ను హ్యాక్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా గుర్తించినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలు, పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల పోస్టులు కనిపించే అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్స్కు సంబంధించిన ట్వీట్స్ కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.


