News February 20, 2025
భద్రకాళి అమ్మవారి దివ్య రూప దర్శనం

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మాఘమాసం గురువారం, సప్తమి తిథి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, భక్తులకు దివ్యరూప దర్శనం కల్పించారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 21, 2025
BREAKING: ఆసిఫాబాద్ SPగా నితిఖా పంత్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీమ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నితిఖా పంత్ నూతన ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 21, 2025
విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.


