News February 8, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
Similar News
News November 14, 2025
HYD: ఇక సిటీలోనూ కాంగ్రెస్ హవా..!

గతంలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పల్లె ప్రజలే కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే హస్తం పార్టీకి సిటీలో బలం లేదనే చర్చ ఏళ్లుగా కొనసాగింది. ఇటీవల కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సిటీలో కాంగ్రెస్కు పునర్ వైభవం వచ్చిందని, GHMC ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
News November 14, 2025
అసమ్మతి నేతలను సైలెంట్ మోడ్లోకి నెట్టిన రేవంత్

TG: కాంగ్రెస్లో గ్రూపు వివాదాలు సాధారణం. ప్రాధాన్యం లేక నిరాశతో ఉన్న సీనియర్లు CM రేవంత్పై పలుమార్లు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినా వాటిని సీరియస్గా తీసుకోలేదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో ఓటమి పాలైతే రేవంతే దీనికి కారణమని బలంగా ఫిర్యాదు చేయొచ్చని వారు భావించారు. కానీ పార్టీ గెలుపుతో నిరాశే ఎదురైంది. పక్కా ప్రణాళికతో సీనియర్లను CM సైలెంట్ మోడ్లోకి నెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 14, 2025
కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


