News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 22, 2025
6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.
News March 22, 2025
MBNR: మార్చి 24 నుంచి ప్రయోగ తరగతులు ప్రారంభం

పాలమూరు జిల్లా MVS కళాశాలలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ సైన్స్, కంప్యూటర్ చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ 1, 3 ప్రయోగ తరగతులు మార్చి 24న సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
News March 22, 2025
పాడేరు: ‘10,500 ఫారంపాండ్స్ నిర్మించాలి’

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దాని పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సచివాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అల్లూరి జిల్లాలో ఫారం పాండ్స్కు ఎక్కువ అవకాశం ఉన్నందున 10,500 ఫారం పాండ్స్ నిర్మించి నీటి వసతి మెరుగుపరచాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ను ఆదేశించారు.