News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 6, 2026
అమెరికాలో పుట్టి.. HYDకు ఆడుతున్నాడు

VHTలో డబుల్ సెంచరీ బాదిన <<18778738>>అమన్ <<>>రావు అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కరీంనగర్కు చెందినవారు కాగా ఉద్యోగ నిమిత్తం USకు వెళ్లారు. HYDలో పెరిగిన అమన్ క్రికెట్పై మక్కువ పెంచుకొని దేశవాళీలో సత్తా చాటుతున్నారు. VHTలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి, ఓవరాల్గా తొమ్మిదో ప్లేయర్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. IPL-2026 మినీ వేలంలో అమన్ను RR ₹30Lakhsకు కొనుగోలు చేసింది.
News January 6, 2026
స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంకులు సాధించాలి: కలెక్టర్

జిల్లా పరిధిలోని 6 మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంకులు సాధించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణాలలో కనిపించే పరిశుభ్రత, ఇంటింటి చెత్త విభజన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పారిశుద్ధ్య సదుపాయాల వంటి వాటిలో మెరుగైన సేవలను అందిస్తూ ర్యాంకులు సాధించాలన్నారు.
News January 6, 2026
ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకున్న జనగామ కలెక్టర్

జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీటీ స్కాన్ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్, యంత్రం పనితీరును పరిశీలించేందుకు స్వయంగా ప్యారానాసల్ సైనసెస్కు సిటీ స్కాన్ చేయించుకున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


