News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 7, 2026
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.
News January 7, 2026
NRPT: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ప్రజల ప్రాణాలు, భద్రత నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలించారాదని సూచించారు.
News January 7, 2026
క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.


