News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News April 19, 2026
నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

భూమి నైట్ లైఫ్పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
News April 19, 2026
నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

భూమి నైట్ లైఫ్పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
News April 19, 2026
చందనోత్సవం స్పెషల్.. సింహాచలం మీదుగా ప్రత్యేక రైలు

సింహాచలం అప్పన్న చందనోత్సవ భక్తుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 20న విశాఖ – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైలు (08512) నడవనుంది. ఈ రైలు ఉదయం 10.30 గంటలకు విశాఖలో బయలుదేరి 10.48 గంటలకు సింహాచలం చేరుకుంటుంది. నిమిషం విరామం తర్వాత 10.49 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.


