News February 27, 2025

భద్రకాళి చెరువులో రుద్రమదేవి.. AI PHOTO

image

సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి చెరువు మధ్యలో రాణి రుద్రమ దేవి విగ్రహం, చుట్టూ కోట కనిపించేలా జనరేట్ చేసిన ఓ ఏఐ ఫొటో ప్రస్తుతం ఓరుగల్లు ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసిన వారంతా చెరువులో రుద్రమదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Similar News

News October 18, 2025

TODAY HEADLINES

image

➢ ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదు: ప్రధాని మోదీ
➢ ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CM CBN
➢ AP: TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ
➢ TG: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన హైకోర్టు.. 2 వారాలు సమయం కోరిన ప్రభుత్వం, ఈసీ
➢ కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM రేవంత్
➢ రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ ఆడతారని చెప్పలేం: అగార్కర్

News October 18, 2025

భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

image

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.

News October 18, 2025

KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

image

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.