News May 20, 2024

భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రవి నాయక్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఆదివారం పాలమూరు యూనివర్సిటీ వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News October 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటరు తుది జాబితా

image

స్థానిక ఎన్నికల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 23,22,054 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,54,128 మంది ఉండగా..11,67,893 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13,765 మంది అధికంగా ఉన్నారు.
1.మహబూబ్ నగర్- 5,16,183
2.నాగర్ కర్నూల్- 6,46,407
3.నారాయణపేట- 4,03,748
4.గద్వాల్- 3,88,195
5.వనపర్తి- 3,67,521

News October 4, 2024

కొడంగల్: యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో సోషల్ స్టడీస్‌లో 2వ ర్యాంక్, VKB జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అదే విధంగా ఇటీవలే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగంతో సత్తా చాటాడు. 4 ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.

News October 4, 2024

NRPT: ‘సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త’

image

దసరా సెలవులకు వేరే వుళ్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయాలని, ఇళ్లలో విలువైన ఆభరణాలు, డబ్బులు వుంచారదని, ఇంటి బయట 24 గంటలు లైట్లు వెలిగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో దొంగలు చేతివాటం చూపుతారని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అన్నారు.