News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Similar News

News December 1, 2025

కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

image

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.

News December 1, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>NTPC<<>> 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బీఈ/బీటెక్, పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్, రాత పరీక్ష/CBT, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST,PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

News December 1, 2025

అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

image

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.