News March 13, 2025
భద్రాచలం: ఆన్లైన్లో టికెట్లు బుకింగ్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.
Similar News
News October 16, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 862 పాయింట్ల లాభంతో 83,467, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 25,585 వద్ద ముగిశాయి. Nestle, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, జియో ఫైనాన్షియల్ టాప్ లూజర్స్.
News October 16, 2025
అంకాపూర్ చికెన్ తిన్నారా..?

అంకాపూర్ చికెన్ అంటే తెలియని వారు ఉండరు. తిన్నారంటే ఆహా అనాల్సిందే. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మెస్ నిర్వహాకులు మాట్లాడారు. ఈ చికెన్ కోసం తామే సొంతంగా మసాల తయారు చేస్తామన్నారు. ఇప్పటికే పలు జిల్లాలోని హోటళ్లలో అంకాపూర్ చికెన్ బ్రాండ్తో విక్రయిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ చికెన్ తిన్నారా..! తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 16, 2025
భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ

TG: ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత భేటీ అయ్యారు. నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న క్యాబినెట్ భేటీకి మంత్రి సురేఖ హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత <<18019826>>ఆరోపించిన<<>> సంగతి తెలిసిందే.