News May 26, 2024

భద్రాచలం ఆలయంలో మళ్లీ వివాదం..!

image

భద్రాచలం ఆలయంలో మరోసారి వివాదం మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రవర మార్చి చదివారని అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్చకులకు, వేద పండితులకు ఈవో మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రవర పఠించే సమయంలో శ్రీరాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో నేడు అందెశ్రీ సంస్మరణ కార్యక్రమం
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం: పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 20, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై గురువారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. HYD నుంచి జరిగిన ఈ సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అ.కలెక్టర్ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.