News November 9, 2024
భద్రాచలం టెంపుల్ వసతి గృహం నుంచి పడి మృతి

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసతి గృహం భవనం నుంచి కిందకు పడి ఓ భక్తుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సీఆర్ఓ కార్యాలయం సమీపంలోని రామాసదనంపై అంతస్తు నుంచి చెన్నైకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలతో మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News January 10, 2026
పండక్కి ఊరెళ్తున్నారా?.. జాగ్రత్తలు తప్పనిసరి: సీపీ సునీల్ దత్

ఖమ్మం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. విలువైన నగదు, బంగారాన్ని వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి తాళం వేసినప్పుడు ఇరుగుపొరుగు వారికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేశామని, అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘100’కు డయల్ చేయాలని తెలిపారు.
News January 10, 2026
ఖమ్మం కలెక్టర్ అనుదీప్కి ‘బిట్స్ పిలాని’ పురస్కారం

ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రతిష్ఠాత్మక ‘బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్’ అవార్డు లభించింది. ప్రజా జీవిత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. గతంలో సివిల్స్ టాపర్గా నిలిచిన అనుదీప్, ప్రస్తుతం పాలనలో తనదైన ముద్ర వేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News January 10, 2026
విద్యుత్ లైన్లకు దూరంగా.. సంక్రాంతి జరుపుకోండి: ఎస్ఈ

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. లోహపు పూత ఉండే చైనా మాంజా వాడటం వల్ల విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీగలకు పతంగులు చిక్కుకుంటే కర్రలతో తీయడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే 1912 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలని కోరారు.


