News April 6, 2025

భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.

Similar News

News November 27, 2025

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు 121 నామినేషన్లు

image

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఆరు మండలాల్లోని 151 గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు గురువారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. మొదటిరోజు 121 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్లకు మరో రెండు రోజులే అవకాశం ఉండడంతో, రేపు, ఎల్లుండి పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

News November 27, 2025

BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

image

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.

News November 27, 2025

శ్రీకాకుళం: యాక్సిడెంట్..మృతుల వివరాలు ఇవే.!

image

పలాస మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు <<18406276>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలకాపు వేణుగా పోలీసు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందిన యువకుడు అని తెలిపారు.