News February 10, 2025
భద్రాచలం: తల్లితో గొడవపడి బాలిక ఆత్మహత్య

తల్లితో గొడవపడి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన 9వ తరగతి బాలిక(14) తన తల్లి విజయలక్ష్మితో కొన్ని రోజులుగా గొడవ పడుతోంది. తల్లితో గొడవను తట్టుకోలేక మనస్తాపం చెందిన ఆ బాలిక క్షణికావేశంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం తల్లి ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Similar News
News April 13, 2026
ఖమ్మం: ఫీజు చెల్లింపునకు 20వరకు అవకాశం

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
News April 13, 2026
ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో వారిదే పైచేయి

ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 78.69% ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానాన్ని, ద్వితీయ సంవత్సరంలో 87.65% ఫలితాలతో 6వ స్థానాన్ని జిల్లా కైవసం చేసుకుంది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడటంతో పాటు, జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 13, 2026
ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.


