News March 23, 2025

భద్రాచలం: పర్ణశాల వేలం రూ.10,625,000

image

పర్ణశాల జీపీ ప్రత్యేకాధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో గోదావరి నదిలో బోటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన వేలం పాట నందు తెల్లం భీమరాజు రూ.44,40,000 మొత్తానికి దక్కించుకున్నారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పాలం పాట నందు వెంకటరమణ రూ.61,00,000 దక్కించుకున్నారు. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణకు రూ.85,000 పాట అయిందని పంచాయతీ కార్యదర్శి సంపత్ తెలిపారు.

Similar News

News September 18, 2025

HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

image

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్‌ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.