News July 12, 2024

భద్రాచలం: పెరిగిన గోదావరి వరద నీటిమట్టం

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం 12 అడుగులు ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 13 8 అడుగులకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు మరో 0.7 అడుగులు పెరిగి 14.5 అడుగులకు చేరుకోనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News October 16, 2025

ఖమ్మం: భారంగా మారిన ఇసుక ధరలు.!

image

ఖమ్మం జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.2,000 నుంచి 2,500 పలుకుతోంది. ఒక ఇంటి నిర్మానికి సుమారు 80 టన్నుల ఇసుక అవసరం అయితే దీనికే రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ ప్రాంతంలో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి. COMMENT

News October 16, 2025

KMM: ఆర్థిక సమస్యలు.. యువకుల సూసైడ్ అటెంప్ట్

image

ఎర్రుపాలెం మండలం ములుగుమాడుకి చెందిన స్నేహితులు ఆముదాల రాము, షేక్ జానీ ఆర్థిక సమస్యల కారణంగా బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాము పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. జానీకి మధిరలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

News October 16, 2025

ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

image

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్‌పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్‌ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.