News March 26, 2025
భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Similar News
News October 18, 2025
ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.
News October 18, 2025
పెద్దపల్లి: ఈనెల 22న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ రూమ్ నం. 225లో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రైవేటు ఇండస్ట్రీస్లో మిషన్ ఆపరేటర్, సూపర్వైజర్, క్లర్క్ వంటి 14 ఖాళీలు ఉన్నాయన్నారు. 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో హాజరుకావాలన్నారు.
News October 18, 2025
HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

బీసీల 42% రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.