News March 4, 2025

భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

image

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 17, 2025

శివారాధనతో జీవితంలో కలిగే మార్పులివే..

image

శివారాధనతో మనస్సు శాంతించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇవి ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కిస్తాయి. శివభక్తి మనలోని తాత్కాలిక కోరికలను తగ్గించి, శాశ్వత జ్ఞానం వైపు దృష్టి మళ్లించేలా చేస్తుంది. లయకారుడైన శివుడి ఆరాధనతో మరణ భయం తొలగి, జీవితంలో ప్రశాంతత, విచక్షణ జ్ఞానం లభిస్తాయని నమ్మకం. స్వచ్ఛమైన మనస్సుతో ఆరాధించేవారికి భోళా శంకరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

News November 17, 2025

RRCATలో 150 పోస్టులు

image

రాజా రామన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (<>RRCAT<<>>) 150 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ITI అర్హతగల అభ్యర్థులు ఈనెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24 ఏళ్ల మధ్య ఉండాలి. NAPS అప్రెంటిస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rrcat.gov.in/

News November 17, 2025

పల్నాడు మహిళా పౌరుష స్ఫూర్తి.. మగువ మాంచాల

image

పల్నాడు మహిళల్లో నేడు కనిపిస్తున్న పౌరుషం, ఆత్మగౌరవానికి ప్రతీకగా మగువ మాంచాలని భావిస్తారు. నాటి పల్నాటి యుద్ధంలో మాచర్ల మహామంత్రి బ్రహ్మనాయుడు కోడలిగా, మహావీరుడు బాలచంద్రుడు భార్యగా ఆమె పాత్ర కీలకమైంది. ఆత్మాభిమానం గల మహిళగా ఆమె తన భర్త బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది కథన రంగానికి పంపింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి బాలచంద్రుడు అసువులు బాసినప్పటికీ ఆమె చూపిన తెగువ నేటికీ కీర్తించబడుతోంది.