News March 4, 2025

భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

image

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 7, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

image

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

News January 7, 2026

HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

image

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.

News January 7, 2026

పిడికిలెత్తిన బిక్కనూర్.. తగ్గేదేలే..!

image

‘ఫార్మా హటావో – బిక్కనూర్ బచావో’ అంటూ నినదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బిక్కనూర్ కమాన్, గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం, దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. <<18785446>>కంపెనీ ప్రాంగణానికి<<>> చేరుకుని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. ‘మా ఊరు- మా ఊపిరి’ అంటూ గళం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు.