News February 12, 2025
భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.
Similar News
News October 25, 2025
195 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్లో 195 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ అప్రెంటిస్లు 40, డిప్లొమా అప్రెంటిస్లు 20, ట్రేడ్ అప్రెంటిస్(ITI) 135 ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్లో కనీసం 70% మార్కులతో పాసై ఉండాలి. వయసు 18ఏళ్లు నిండి ఉండాలి. వెబ్సైట్: https://www.drdo.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 25, 2025
పార్వతీపురం మన్యంలో గిరిజన విద్యార్థిని మృతి

సీతంపేట మండలం పీవీ ఈతమానుగూడ పంచాయతీ పరిధిలో దొంబంగివలస గ్రామానికి చెందిన గిరిజన బాలిక మండంగి కవిత (11) మరణించింది. ఈ బాలిక హడ్డుబంగి ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో 6వతరగతి చదువుతుంది. ఇటీవల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైన బాలికను కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 25, 2025
డ్రైవర్ బస్సును అక్కడే ఆపుంటే..

వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై బైక్ను ఢీకొన్న వెంటనే ఆగి ఉంటే పెను ఘోరం జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు అతివేగంగా వెళ్తున్న బస్సు కర్నూలు శివారులో ముందు వెళ్తున్న బైక్ను ఢీకొంది. ద్విచక్రవాహనదారుడు శివశంకర్ (24) మృతిచెందాడు. బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ను కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ ట్యాంకు మూత ఊడి మంటలు చెలరేగాయన్న చర్చ జరుగుతోంది.


