News July 13, 2024

భద్రాచలం వంతెనకు 60 సంవత్సరాలు

image

భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పాత వంతెన నేటితో 59 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ వంతెనను 1965 జులై 13న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1959లో శంకుస్థాపన చేయగా రూ.70 లక్షల వ్యయంతో ముంబైకి చెందిన పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

Similar News

News January 11, 2026

వణుకుతున్న ఖమ్మం జిల్లా

image

ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సైతం ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రమైన చలిగాలుల ధాటికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు చలికోట్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.

News January 11, 2026

ఖమ్మం: మ్యూజియం ముచ్చట తీరేదెన్నడు?

image

ఖమ్మం జిల్లా సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుపై విద్యాశాఖ తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మ్యూజియం కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించినా, పనులు అడుగు ముందుకు పడటం లేదు. మ్యూజియం వివరాలు అందజేయాలని డీఈవో ఆదేశించి 15 రోజులు గడుస్తున్నా కిందిస్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం వీడలేదు. ప్రయోగాత్మక విద్యకు ఈ జాప్యం పెద్ద అడ్డంకిగా మారింది.

News January 10, 2026

ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలి: Dy.CM భట్టి

image

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీలు,పెండింగ్ నిధులపై కూడా చర్చించారు.