News March 6, 2025
భద్రాచలం- విజయవాడ రైళ్లు రద్దు..!

కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ పనులు నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే అధికారి ఎం.డీ.జాఫర్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు భద్రాచలం- విజయవాడ రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం రైల్వే స్టేషన్లో సంప్రదించాలన్నారు.
Similar News
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి
News November 18, 2025
తుమ్మలను BRS వదులుకోవడం పెద్ద తప్పు: కవిత

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని దూరం చేసుకోవడం పెద్ద తప్పని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో తనపై కుట్ర చేసి బయటకు పంపారని ఆరోపించారు. ఉద్యమ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టారని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు. తాను వెళ్తున్న ప్రతి ప్రాంతానికి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఆమె తెలిపారు.


