News March 6, 2025

భద్రాచలం- విజయవాడ రైళ్లు రద్దు..!

image

కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్‌ పనులు నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే అధికారి ఎం.డీ.జాఫర్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు భద్రాచలం- విజయవాడ రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం రైల్వే స్టేషన్‌‌లో సంప్రదించాలన్నారు.

Similar News

News November 22, 2025

మహబూబాబాద్‌లో ఆయనది చెరగని ముద్ర !

image

సుధీర్ రామ్నాథ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా వాసులకు సుపరిచితమైన పేరు. విపత్కర పరిస్థితుల్లో నేనున్నానంటూ భరోసా అందించిన ఎస్పీ సుధీర్.. జిల్లాలో సామాన్యుల పట్ల చూపిన ఔదార్యంతో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా జిల్లా రైతాంగం యూరియా కోసం, తీర్థ ఇబ్బందులు పడిన సమయంలో తనదైన నేర్పుతో సమస్యను సునాయాసం చేశారు. వృత్తిపరంగా బదిలీపై వెళ్లినప్పటికీ వ్యక్తి పరంగా సామాన్యుల హృదయంలో నిలిచిపోయారు.

News November 22, 2025

కార్ల వేలానికి ఓకే.. నీరవ్ ‌మోదీకి సీబీఐ కోర్టు షాక్

image

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్‌రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్‌ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.

News November 22, 2025

‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

image

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.