News March 13, 2025

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Similar News

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

News December 7, 2025

సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

image

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.

News December 7, 2025

కొత్తగూడెం: మత్తులో ట్రాక్‌ దాటుతూ రైలు కిందపడి..

image

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.