News December 25, 2024
భద్రాచలం TO టీమిండియా.. జర్నీ ఇలా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735094918591_729-normal-WIFI.webp)
ICC అండర్-19 మహిళల ప్రపంచ్ కప్ టీమిండియా స్క్వాడ్లో భద్రాచలంకు చెందిన త్రిషకు <<14974104>>చోటు లభించిన<<>> సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఓ కంపెనీలో ఫిట్ నెస్ ట్రైనర్గా పనిచేసేవారు. త్రిష ప్రతిభను గుర్తించి తన జాబ్ను విడిచిపెట్టి మరీ ప్రోత్సహించారు. ఆమె కోసం సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. HYD సౌత్ జోన్, సీనియర్ టీం, 2023 ICC అండర్-19 T20 ప్రపంచ కప్, ఆసియాకప్ ఆడిన త్రిష మళ్లీ ICC-19 ప్రపంచ కప్కు సెలక్టయ్యారు.
Similar News
News January 17, 2025
ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737073485490_51989201-normal-WIFI.webp)
ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్ఆర్ఎస్ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.
News January 17, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737072552320_11885857-normal-WIFI.webp)
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న రేషన్ కార్డుల సర్వే
News January 16, 2025
కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737020154967_18054828-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.