News April 6, 2025
భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.
Similar News
News November 18, 2025
Way2News కథనానికి నాగార్జున వర్సిటీ స్పందన

<<18322201>>మాస్టారూ.. ఇదేం క్వశ్చన్ పేపర్?<<>> అంటూ Way2Newsలో మంగళవారం వచ్చిన వార్తకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల సమన్వయకర్త స్పందించారు. బీఈడి, ఎంఈడీ, ఎల్బీబీ, పీజీ సైన్స్, ఆర్ట్స్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటం వల్ల పొరపాటున Msc 3rd సెమిస్టర్ ప్రశ్నాపత్రం రాతపూర్వకంగా వచ్చిందని తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News November 18, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. 500 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ఉషారాణి, జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి, SGF జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పీడీలు వేణుగోపాల్, రామచందర్, రాములు, ముస్తఫా, కృష్ణ, మోహిన్, రవికుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.
News November 18, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.


