News April 5, 2025

భద్రాద్రిలో నేడు ఎదుర్కోలు ఉత్సవం

image

భద్రాద్రిలో శ్రీసీతారాములవారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. సీతారాముల వారి గుణాలను వివరించే తీరు భక్తులను మంత్రముగ్ధులను చేయనుంది. సీతమ్మవైపు ఒకరు, రామయ్యవైపు మరొకరు ఉండి ఇరు వంశాల విశిష్ఠతను వివరించే తీరు వీనుల విందుగా ఉండనుంది.

Similar News

News July 11, 2025

ఓరుగల్లు: బీసీ రిజర్వేషన్.. స్థానిక ఎన్నికల్లో ఉత్కంఠ.!

image

రాష్ట్ర ప్రభుత్వ బీసీ 42% రిజర్వేషన్‌ ఆర్డినెన్స్ అంశంపై గ్రామాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబరు 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌లో 1702 పంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జడ్పీటీసీ స్థానాల కోసం అశావహులు ఎదురు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌తో ఉమ్మడి జిల్లాలో 700 పంచాయతీలు, 325 ఎంపీటీసీ స్థానాలు బీసీల పరం కానున్నాయి.

News July 11, 2025

జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

image

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.

News July 11, 2025

MBNR: పల్లె పోరు.. రిజర్వేషన్ల ఫీవర్

image

ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఏ రిజర్వేషన్ వస్తదో అని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,684 గ్రామపంచాయతీలు ఉండగా.. 23,22,054 మంది పల్లెల్లో ఓటర్లు ఉన్నారు. 74 ZPTC స్థానాలతో పాటు 19 పురపాలికలున్నాయి.