News February 3, 2025
భద్రాద్రిలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్.. ఎందుకు?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 18, 2026
నేటి నుంచి నాగోబా జాతర

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.
News January 18, 2026
చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే ఇది 34% ఎక్కువ. సాధారణంగా జిల్లాలో రోజుకు రూ.కోటి వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. న్యూ ఇయర్ పురస్కరించుకొని రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. పండుగల వేళ భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
News January 18, 2026
సింహాచలంలో ఇవాళ 6 గంటల వరకే దర్శనం

సింహాచలం వరహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జనవరి 18వ తేదీ దర్శన వేళలో మార్పులు చేశారు. జనవరి 18న కొండ కింద గల వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఈవో సుజాత శనివారం తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. తెప్పోత్సవం తరువాత స్వామి వారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.


