News April 6, 2025
భద్రాద్రిలో ముగిసిన CM రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తాళ్ల గుమ్మూరు గ్రామంలో గిరిజన కుటుంబంలో భోజనాలు చేసిన అనంతరం బీపీఎల్లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాదుకు బయలుదేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర శాఖల అధికారులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News November 27, 2025
గన్నవరం పోతే ఎలా..? భిన్నవాదనలు..!

కృష్ణా జిల్లాలోని గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్పై ఎమ్మెల్యేలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి గన్నవరం విడిపోతే జిల్లా ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇప్పటి వరకు ఈ ఎయిర్ పోర్ట్ జిల్లాకు పెద్ద ఆస్తిగా ఉంది. ఈ క్రమంలో గన్నవరంను చేజార్చుకోకూడదన్నది కొంతమంది ఎమ్మెల్యేల మనోగతంగా తెలుస్తోంది.
News November 27, 2025
రాయచోటిలో బస్సులు ఆపి వీరంగం..6 రోజుల జైలు

రాయచోటి టౌన్ బంగ్లా సర్కిల్లో శనివారం యువకుడు కళ్యాణ్ ఆర్టీసీ బస్సులను అడ్డగించి డ్రైవర్లతో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. AJFCM కోర్టు రాయచోటిలో ఇన్ఛార్జ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ తేజస్విని ఎదుట హాజరుపరచగా ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
News November 27, 2025
అమరావతిలో ‘మెగా’ ఎయిర్పోర్ట్.. మాస్టర్ ప్లాన్ వివరాలివే!

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 4,618 ఎకరాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయనున్నారు. 4 కి.మీ పొడవైన రన్వేను ఫేజ్-1లో ప్లాన్ చేశారు. ఇది ‘కోడ్-4ఎఫ్’ స్థాయి విమానాశ్రయం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380, బోయింగ్ 777-9 కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చని సమాచారం.


