News March 30, 2025

భద్రాద్రి: అత్తమామను కత్తితో పొడిచిన అల్లుడు

image

అత్తమామలపై అల్లుడు కత్తితో పొడిచిన ఘటన అశ్వాపురం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాలిలా.. తన భార్య స్రవంతి గత రెండేళ్లుగా కాపురానికి రావడం లేదని భర్త శ్రావణ్ అశ్వాపురంలోని అత్తగారింటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. అడ్డువచ్చిన మామ నరసింహులు, అత్త వనజాక్షిని కత్తితో గాయపరిచారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.

Similar News

News December 7, 2025

ADB: చెక్ పవర్ ఉంటే చాలు ఇంకేమీ వద్దు..!

image

పదవిపై ఆశ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించక సర్పంచ్ స్థానం రానివారు వార్డు మెంబర్‌గా పోటీ చేసే ఉపసర్పంచ్ అవుదామనుకుంటున్నారు. ఇప్పటికే నామినేషన్ల సమర్పణ పూర్తికాగా.. వార్డు మెంబర్లుగా బరిలో ఉన్న వారికి కానుకలిస్తూ తనను ఉప సర్పంచ్‌గా బలపరచాలని కోరుతున్నారు. చెక్ పవర్ కోసం పాకులాడుతున్నారు.

News December 7, 2025

ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

image

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 7, 2025

వార్డ్ మెంబర్‌కు రూ.500.. సర్పంచ్‌కు రూ.1500

image

మొదటి విడత ఎన్నికలు సమీపిస్తుండడంతో డబ్బులు ఎరవేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్‌ ఓటుకు రూ.1500, వార్డుమెంబర్ ఓటుకు రూ.500 డబ్బులు ఫిక్స్ చేస్తున్నారు. రిజర్వేషన్ జనరల్ వచ్చిన GPలలో డబ్బు ఖర్చు తీవ్రత ఎక్కువగా కనబడుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎలాగైనా ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డేగ కన్ను ఉందన్న విషయాన్ని విస్మరించి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.