News March 30, 2025

భద్రాద్రి: అత్తమామను కత్తితో పొడిచిన అల్లుడు

image

అత్తమామలపై అల్లుడు కత్తితో పొడిచిన ఘటన అశ్వాపురం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాలిలా.. తన భార్య స్రవంతి గత రెండేళ్లుగా కాపురానికి రావడం లేదని భర్త శ్రావణ్ అశ్వాపురంలోని అత్తగారింటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. అడ్డువచ్చిన మామ నరసింహులు, అత్త వనజాక్షిని కత్తితో గాయపరిచారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.

Similar News

News November 19, 2025

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 1,70,331 చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,14,681 చీరలు జిల్లాకు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు.

News November 19, 2025

కగార్ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

image

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.

News November 19, 2025

PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

image

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.