News March 30, 2025

భద్రాద్రి: అత్తమామను కత్తితో పొడిచిన అల్లుడు

image

అత్తమామలపై అల్లుడు కత్తితో పొడిచిన ఘటన అశ్వాపురం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాలిలా.. తన భార్య స్రవంతి గత రెండేళ్లుగా కాపురానికి రావడం లేదని భర్త శ్రావణ్ అశ్వాపురంలోని అత్తగారింటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. అడ్డువచ్చిన మామ నరసింహులు, అత్త వనజాక్షిని కత్తితో గాయపరిచారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.

Similar News

News November 5, 2025

NEET-SS దరఖాస్తులు ప్రారంభం

image

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

News November 5, 2025

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

image

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

రాష్ట్ర భ‌విష్య‌త్తుకే త‌ల‌మానికం: మంత్రి డోలా

image

విశాఖ‌ వేదిక‌గా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికం కానుంద‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాట్ల‌ను బుధ‌వారం ప‌రిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వంద‌ల సంఖ్య‌లో వివిధ కంపెనీల ప్ర‌తినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, 7.5 లక్ష‌ల ఉద్యోగావ‌కాలు వ‌స్తాయ‌న్నారు.