News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

Similar News

News December 6, 2025

జగిత్యాల: ‘పత్రాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్’

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రాయపట్నం చెక్‌పోస్ట్‌, కిషన్రావుపేట పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్రమ నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై కఠిన నిఘా కొనసాగుతోందని, పత్రాలు లేకుండా భారీ మొత్తంలో నగదు తీసుకెళితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు.

News December 6, 2025

ఇండిగో CEOపై చర్యలు, భారీ ఫైన్?

image

విమాన కార్యకలాపాల నిర్వహణలో ఫెయిలైన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌ను సస్పెండ్ చేసే ఆలోచనలో విమానయాన శాఖ ఉందని తెలుస్తోంది. వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు ఇండిగో సర్వీసులను తగ్గించాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. FDTL అమలులో నిర్లక్ష్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని కేంద్రం భావిస్తోంది. కాగా, ఆ రూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

News December 6, 2025

జగిత్యాల: ‘ప్రజా భద్రతలో హోం గార్డులది కీలక పాత్ర’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, ఎన్నికలు, నైట్ పెట్రోలింగ్, నేర నిరోధం, విపత్తు నిర్వహణలో హోం గార్డుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కళాబృందం అవగాహన కార్యక్రమాలను అభినందించారు. హోం గార్డుల సంక్షేమం కోసం భత్యాల పెంపు, బీమా, రెయిన్ కోట్లు, జాకెట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సిబ్బందికి బహుమతులు అందజేశారు.