News March 26, 2025
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.
News April 22, 2025
జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.
News April 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

∆} ఖమ్మంలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు ∆} ముదిగొండలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన