News March 1, 2025

భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

జనగాం: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఎన్నికల విధులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలపై అధికారులకు శిక్షణ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మధురిషా తదితరులు పాల్గొన్నారు.

News November 27, 2025

జగిత్యాల: ఎయిడ్స్ డే ప్రోగ్రామ్స్‌కు ప్రత్యేక ప్రణాళిక

image

డిసెంబర్ 1న నిర్వహించనున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై బుధవారం జగిత్యాల డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్‌ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు పీహెచ్సీలు, సబ్‌సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

News November 27, 2025

సిరిసిల్ల: ‘రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి’

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇంచార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంచార్జి కలెక్టర్ సమావేశం నిర్వహించి, సూచనలు చేశారు.