News March 11, 2025

భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News November 17, 2025

దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

image

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.

News November 17, 2025

PDPL: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

image

PDPL(D) సుల్తానాబాద్ మం.లోని చిన్నకల్వల వద్దగల రాజీవ్ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో ఇదే గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం(72) అక్కడికక్కడే మృతిచెందాడు. SI శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశం ఇంట్లోని చెత్తను ఇంటి ముందు ఉన్న చెత్తకుండీలో వేసి వెనుకకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్- పెద్దపల్లివైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

News November 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> నిడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
> కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మెరుగైన వైద్య సేవలు అందించాలి పాలకుర్తి ఎమ్మెల్యే
> దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> ఆర్ఎంపి, పిఎంపి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
> చిట్టితల్లిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి