News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
నేడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు
AP: మూడు మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, 4 పురపాలికల్లో వైస్ ఛైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇందుకోసం ఉ.11 గంటలకు కౌన్సిళ్లకు సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ, నూజివీడు, తుని, పిడుగురాళ్ల, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి.
News February 3, 2025
ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. ఇవాళ నోటిఫికేషన్
MLC ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. APలోని ఉ.గోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. TGలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.
News February 3, 2025
అభిషేక్ హిట్టింగ్.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్: బట్లర్
చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.