News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు: PM మోదీ

LVM3-M6 <<18655479>>మిషన్ను<<>> సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. ‘ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్లో మన పాత్రను బలోపేతం చేస్తుంది. గ్లోబల్ పార్ట్నర్షిప్స్, కమర్షియల్ లాంచ్ సర్వీసుల విస్తరణ రాబోయే గగన్యాన్ వంటి మిషన్లకు బలమైన ఫౌండేషన్గా మారుతుంది. యువ శక్తితో మన స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ అవడంతో పాటు ఎఫెక్టివ్ అవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News December 24, 2025
జహీరాబాద్: మాజీ సబ్ రిజిస్ట్రార్, కమిషనర్పై కేసు నమోదు

భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ SI వినయ్ కుమార్ తెలిపారు. 2018లో ZHBకు చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్తో కలిసి HYDకు చెందిన వినోబా ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్ ఉల్లంఘించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి తనను మోసం చేశారని బాధితుడి ఫిర్యాదుతో అధికారులు సహానలుగురిపై కేసు నమోదైంది.
News December 24, 2025
రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


