News February 6, 2025

భద్రాద్రి: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య.. UPDATE

image

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై సువర్ణపాక లక్ష్మీ నర్సు(36) <<15377589>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని 15వ బెటాలియన్‌కు చెందిన లక్ష్మీనర్సు భద్రాద్రి, బయ్యారం ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. భార్య సునీతను ఇంటి నుంచి గెంటి వేశారని, ఆమె హన్మకొండలోని బంధువుల ఇంటికి పిల్లలతో వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 9, 2026

బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

image

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.

News February 9, 2026

శ్రీశైలంలో నేడు బృంగివాహన సేవ

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మల్లన్న బృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు

News February 9, 2026

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.