News February 27, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94% నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం4 గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 91.94% ఓట్లు పోలైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2022 మంది ఓటర్లు ఉండగా 1859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
పార్వతీపురం: యాక్సిడెంట్.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పంచాయతీ ఎరుకలపేటలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన నారాయణమ్మ బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందన్నారు.
News February 23, 2026
కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.
News February 23, 2026
సంగారెడ్డి: రాత్రి యువకుడిపై కర్రతో దాడి

సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. 10 గంటల సమయంలో చాకలి వీరేశం, రంజిత్ మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రంజిత్ కర్రతో దాడి చేయడంతో వీరేశం తలకు బలమైన గాయమైంది. 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.


