News March 25, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి అవార్డు

image

ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సీఆర్పిఎఫ్ అధికారులు అభినందించారు. సోమవారం సీఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారుసిన్హా చేతుల మీదుగా డీజీ డిస్క్ ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందుకున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన సందర్భంగా అవార్డు లభించింది.

Similar News

News November 10, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

KNR జిల్లా తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ” పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు NOV 12 వరకు పొడిగించినట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు NOV 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

News November 10, 2025

కరీంనగర్: సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News November 10, 2025

జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది: సీజేఐ

image

ఒక పక్షానికి అనుకూలంగా ఆదేశాలివ్వకపోతే జడ్జిపై ఆరోపణలు చేసే ట్రెండ్ పెరుగుతోందని సుప్రీంకోర్టు CJI గవాయ్ అన్నారు. TG హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన N.పెద్దిరాజు కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజు చెప్పిన క్షమాపణలను జడ్జి అంగీకరించారని అడ్వకేట్ సంజయ్ హెగ్డే తెలిపారు. దీంతో విచారణను ముగిస్తున్నట్లు CJI ప్రకటించారు.