News March 25, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి అవార్డు

ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సీఆర్పిఎఫ్ అధికారులు అభినందించారు. సోమవారం సీఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారుసిన్హా చేతుల మీదుగా డీజీ డిస్క్ ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందుకున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన సందర్భంగా అవార్డు లభించింది.
Similar News
News December 4, 2025
మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.
News December 4, 2025
సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

TG గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్లు అతిథులను అలరించనున్నాయి.
News December 4, 2025
HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.


