News March 25, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి అవార్డు

ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సీఆర్పిఎఫ్ అధికారులు అభినందించారు. సోమవారం సీఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారుసిన్హా చేతుల మీదుగా డీజీ డిస్క్ ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందుకున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన సందర్భంగా అవార్డు లభించింది.
Similar News
News November 28, 2025
BREAKING.. సిరిసిల్ల: మాజీ నక్సలైట్ దారుణ హత్య

సిరిసిల్ల(D) తంగళ్లపల్లి(M) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అనే మాజీ నక్సలైట్ దారుణహత్యకు గురయ్యారు. నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్.. పథకం ప్రకారం సిరిసిల్ల సమీపంలోని అగ్రహారం గుట్టలకు పిలిపించి హతమార్చి JGTL పోలీసులకు లొంగిపోయారని సమాచారం.
News November 28, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: RTI కమిషనర్
✓ పాల్వంచ: బాల్య వివాహ రహితంగా భద్రాద్రిని మార్చాలి
✓ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ
✓ సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థులకు మేలు: కలెక్టర్
✓ అశ్వాపురం: లోన్ ఇప్పిస్తానని మోసం.. బాధితుల నిరసన
✓ ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి జిల్లా ఎన్నికల పరిశీలకులు
✓ లక్ష్మీదేవిపల్లి: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: UTF
News November 28, 2025
జగిత్యాల: సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణపై అధికారులు మార్గనిర్దేశం

వైజ్ఞానిక ప్రదర్శన రెండు రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు JGTL జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విధులు స్పష్టంగా వివరించి, నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. సెక్టారియల్ అధికారి రాజేష్, మల్యాల విద్యాధికారి జయసింహారావు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.


