News February 13, 2025

భద్రాద్రి: కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్

image

కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తికి మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ వివరాలిలా.. 2023లో అశ్వాపురానికి చెందిన ముత్యంబోయిన వెంకటేశ్వర్లు అదే మండలానికి చెందిన సున్నం సత్యనారాయణకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేయగా, వాయిదాలకు రాకపోవడంతో రిమాండ్ విధించారు.

Similar News

News February 13, 2025

కరీంనగర్: దత్తత ఉత్తర్వులు అందించిన కలెక్టర్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహం నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈరోజు కలెక్టరేట్‌లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహం నుంచి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.

News February 13, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 13, 2025

వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు?

image

AP: వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదు కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వంశీ నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు నమోదైన కేసులో ఆయన పాత్ర లేదని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని MLA యార్లగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో YSRCP హయాంలో రూ.210 కోట్ల మేర మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ కేసుల్లో వంశీని పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది.

error: Content is protected !!