News February 13, 2025

భద్రాద్రి: కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్

image

కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తికి మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ వివరాలిలా.. 2023లో అశ్వాపురానికి చెందిన ముత్యంబోయిన వెంకటేశ్వర్లు అదే మండలానికి చెందిన సున్నం సత్యనారాయణకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేయగా, వాయిదాలకు రాకపోవడంతో రిమాండ్ విధించారు.

Similar News

News October 23, 2025

డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్

image

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను తెలియపరిచేందుకు రంగోలీ పోటీలు నిర్వహించారు.

News October 23, 2025

సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

image

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్‌ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 23, 2025

రేపు మేడారానికి మంత్రులు.. కొండా సురేఖ కూడా..?

image

మేడారం మహా జాతర పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర మంత్రుల బృందం శుక్రవారం వస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రుల పర్యటనలో దేవాదాయ మంత్రి కొండా సురేఖ గైర్హాజరవ్వడం తీవ్ర చర్చ జరగడంతో పాటు వివాదాలకు కారణమైంది. మీనాక్షి నటరాజ్ చొరవతో వివాదం సద్దుమనగగా.. రేపటి పర్యటనలో సురేఖ కూడా ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ దివాకర ఈరోజు మేడారంలో పర్యటించి వన దేవతల గద్దెల పనులను పర్యవేక్షించారు.