News April 5, 2025

భద్రాద్రి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం కర్నెగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కే.నరసింహారావు ఇంట్లో జరిగిన ఘర్షణలో గడ్డి మందు తాగినట్లు స్థానికులు చెప్పారు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ రతీశ్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News December 13, 2025

హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇలా..

image

* రాత్రి.7.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్ గాంధీ, CM రేవంత్
* 7.55 గంటలకు మ్యాచ్ కిక్ ఆఫ్
* 8.06 గంటలకు గ్రౌండ్‌లోకి మెస్సీ, రేవంత్
* 8.33 గంటలకు పెనాల్టీ షూటౌట్
* 8.53 గంటలకు మెస్సీ చేతులమీదుగా విజేతకు ‘GOAT’ కప్ ప్రదానం
* 8.54 గంటలకు మెస్సీని సత్కరించనున్న సీఎం
* 8.57 గంటలకు కార్యక్రమం ముగింపు

News December 13, 2025

మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్‌లాల్‌ ఈ నెల 12న జీవో 1568 జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు 20 రోజుల్లోగా తమ దరఖాస్తులను ఆలయ సహాయ కమిషనర్‌, ఈవో ఆర్‌వీ చందనకు అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News December 13, 2025

ఓరుగల్లు ఓటరూ.. 100% పోలింగ్ చేయలేమా?

image

ఉద్యోగం నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లిన జిల్లా ప్రజలు ఎన్నికలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. సెలవులు, సమయం లేక సొంతూరు వచ్చి ఓటేయట్లేదు. మీగ్రామం అభివృద్ధికి దూరమవడానికి ఇదికూడా కారణమే. మీరు ఎంచుకునే అభ్యర్థి ఐదేళ్లు చేసే అభివృద్ధిపైనే గ్రామం ఆధారపడుతుంది. రేపు ఎలాగూ సండే కాబట్టి ఊరెళ్లి ఓటేద్దాం. మొదటి విడతతో WGL-86.83, HNK-83.95, JNGM-87.33, MLG-78.65, MHBD-86.99, BHPL-82.26% మాత్రమే పోలింగ్ అయింది.