News April 5, 2025

భద్రాద్రి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం కర్నెగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కే.నరసింహారావు ఇంట్లో జరిగిన ఘర్షణలో గడ్డి మందు తాగినట్లు స్థానికులు చెప్పారు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ రతీశ్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News December 4, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 850 నామినేషన్లు

image

ఉమ్మడి WGLలో 3వ విడత తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 357, వార్డులకు 493కు నామినేషన్లు దాఖలైయ్యాయి. WGLజిల్లాలో 109 GPలకు 51, 946 వార్డులకు 73 నామినేషన్లు, HNKలో 68 GPలకు 62 సర్పంచ్, 634 వార్డులకు 86, ములుగులో 46 GPలకు 11, 408 వార్డులకు 22, జనగామలో 91 GPలకు సర్పంచ్ 41, 800 వార్డులకు 37, MHBDలో 169 సర్పంచి స్థానాలకు 87, 1412 వార్డులకు100, BHPLలో 81 GP లకు 106, 696 వార్డులకు 175 నామినేషన్లు పడ్డాయి.

News December 4, 2025

రూ.97.52 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు

image

స్వదేశీ దర్శన్ పేరుతో రూ.97.52 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధికి పనులు మొదలయ్యాయని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో చెప్పారు. ఇందులో భాగంగా ఆదర్శనగర్ కాల్వలో హౌస్ బోట్ ప్రాజెక్ట్‌ను సూర్యలంక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. హరిత రిసార్ట్స్ వద్ద రూ.7.50 కోట్ల నిధులతో అధునాతన హంగులతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. స్విమ్మింగ్ పూల్, 10 కాటేజీల పనులు త్వర త్వరగా ముగించాలన్నారు.

News December 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 86

image

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>