News March 9, 2025
భద్రాద్రి: గిరిజనుల వంట రుచి చూసిన ఎమ్మెల్యే, కలెక్టర్

దుమ్ముగూడెం మండలం బొజ్జుగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. మహిళ అధికారులు, మహిళ సంఘాలు, విద్యార్థులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళ కళాబృందంచే నృత్య ప్రదర్శనలు, గిరిజన పండ్లు, పాలపండ్లు, రాగి జావ, జొన్న జావ, తేనే రుచి చూశారు.
Similar News
News March 10, 2025
40 డిగ్రీలు దాటనున్న పగటి ఉష్ణోగ్రతలు

TG: మరో వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిన్న అత్యధికంగా నల్గొండ (D) చిట్యాలలో 39.8 డిగ్రీలు నమోదైంది. KNR, HNK, BHPL, KMR, ASF, NZB, మేడ్చల్, నారాయణ్ పేట్, నిర్మల్, PDPL, SDPT, వనపర్తి, MHBD జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7డిగ్రీలుగా రికార్డ్ అయింది.
News March 10, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News March 10, 2025
ఓరుగల్లులో భూముల ధరకు రెక్కలు!

WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.