News April 6, 2025

భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

image

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

Similar News

News November 18, 2025

ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ₹7,491

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటా రూ.7,491 పలికింది. వేరుశనగ ధర రూ.6,879 వరకు, ఆముదాలు రూ.5,861 వరకు నమోదయ్యాయి. అయితే, సీసీఐ (CCI) తేమ శాతం పేరుతో పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.

News November 18, 2025

ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ₹7,491

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటా రూ.7,491 పలికింది. వేరుశనగ ధర రూ.6,879 వరకు, ఆముదాలు రూ.5,861 వరకు నమోదయ్యాయి. అయితే, సీసీఐ (CCI) తేమ శాతం పేరుతో పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.

News November 18, 2025

VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

image

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.