News April 6, 2025

భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

image

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

Similar News

News November 18, 2025

వాహన ఫిట్‌నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

image

వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్‌కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.

News November 18, 2025

వాహన ఫిట్‌నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

image

వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్‌కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.

News November 18, 2025

ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

image

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్‌ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.