News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News November 13, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నేరడిగొండ, భీంపూర్, బేలా, బోథ్, జైనథ్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కిచెన్ షెడ్, ప్రహరీగోడ, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ITDA PA యువరాజ్ మర్మాట్ తదితరులు ఉన్నారు.
News November 13, 2025
GWL: అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి

జిల్లావ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ తదితర పనులు ఎందుకు పూర్తి కాలేదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలన్నారు.
News November 13, 2025
GWL: నిరుద్యోగులకు జాబ్ మేళా- ప్రియాంక

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు ఐడిఓసిలోని F-30/1 బ్లాక్లో నిర్వహిస్తామని తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాలు వయసు గలవారు హాజరు కావాలన్నారు.


