News January 31, 2025
భద్రాద్రి: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.సుచరిత గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. కొత్తగూడెం జిల్లా రామవరంనకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద, సన్యాసి బస్తీకి చెందిన కొడాలి నరసింహారావు రూ.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు ఇచ్చాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.
Similar News
News September 15, 2025
పెద్దపల్లి: ఈనెల 19న జాబ్ మేళా

నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు కల్పించుటకు SEP 19న సోమవారం MPDO ఆఫీస్ ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడల్ అనలిస్ట్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించండి.
News September 15, 2025
KMR: నాటి ఇంజినీర్ల సృష్టి ఈ అద్భుతాలు!

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ కోట, లింగంపేట బావి, పోచారం ప్రాజెక్టులు ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన సామర్థ్యాన్ని మించి వరదను తట్టుకుని నిలబడింది. ఈ నిర్మాణాలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటూ నాటి ఇంజినీరింగ్ ప్రమాణాలను నిరూపిస్తున్నాయి. ఆనాటి ఇంజినీర్ల కృషికి ఈ కట్టడాలు నిలువెత్తు నిదర్శనం.
News September 15, 2025
అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.