News January 31, 2025
భద్రాద్రి: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.సుచరిత గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. కొత్తగూడెం జిల్లా రామవరంనకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద, సన్యాసి బస్తీకి చెందిన కొడాలి నరసింహారావు రూ.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు ఇచ్చాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.
Similar News
News November 8, 2025
VZM: గుండెలు కుదిపేసిన దృశ్యం

గరివిడి (M) చిన ఐతంవలస వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీలత మృతి చెందిన విషయం <<18229652>>తెలిసిందే<<>>. స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. శ్రీలత తల పైనుంచి RTC బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గాయపడిన భర్త సంఘంనాయుడు భార్యను ఒడిలో పెట్టుకొని ఎవరైనా కాపాడండయ్యా అంటూ రోధించాడు. ఆమె బతికే ఉందంటూ మంచినీరు పట్టేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు సంఘటనా స్థలంలో ఉన్నవారి గుండెలను పిండేసింది.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
ఫేక్ న్యూస్పై తుమ్మల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

ఖమ్మం: తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీతను గెలిపించాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు వచ్చిన ఫేక్ కథనాన్ని ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని బదనాం చేసేలా వార్త ప్రచురించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది BRS దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శిస్తూ, తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.


